30 July, 2026 | 5:49 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

దోమలు బాబోయ్ దోమలు..

23-02-2026 12:04 AM

నిల్వ నీటితో ప్రజల ఇబ్బందులు

అశ్వాపురం, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): అశ్వాపురం జగదంబ షాప్ స్ట్రీట్ లైన్లోని సీసీ రోడ్డు, మూలవద్ద రోడ్ పగిలిపోవడంతో గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో గత రెండేళ్లుగా మురికి నీరు నిల్వ ఉండటంతో అక్కడ ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ఈ పరిస్థితి కారణంగా చుట్టుపక్కల నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు.

నిల్వ నీటితో దోమలు అధికంగా పెరిగి విషజ్వరాలు వ్యాపిస్తున్నాయని ఆ వీధి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చెడు వాసనతో పాటు దోమల సమస్య రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీకి ఎన్నిసార్లు తెలియజేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి సీసీ రోడ్డుకు మరమ్మతులు చేసి, నిల్వ నీటిని తొలగించి శుభ్రత చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.