calender_icon.png 1 July, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ములకలపల్లి మండలంలో ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన..

30-06-2025 10:18:17 PM

పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన, ప్రారంభోత్సవం..

ములకలపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ పరిధిలోని ములకలపల్లి మండలంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి(MP Ramasahayam Raghuram Reddy), అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ(MLA Jare Adinarayana) సోమవారం పర్యటించారు. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మాదారం గ్రామపంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ప్రారంభించారు. మొలకలపల్లి గ్రామపంచాయతీలో 11 సీసీ రోడ్లను, జడ్పీహెచ్ఎస్ లో నూతన తరగతికి భవనాలను ప్రారంభించారు. పాత గంగారం పంచాయతీలో వాగోడు గుంపులో బీటీ రోడ్డును ప్రారంభోత్సవం చేశారు.

జగన్నాధపురం పంచాయతీలో బీటీ, సీసీ రోడ్లను ప్రారంభోత్సవం చేసి, అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు. సీతయ్య గూడెం పంచాయతీలో పలు రోడ్లను, పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మారుమూల గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. కాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసి విజయఢంకా మోగించాలని పిలుపునిచ్చారు.