06-06-2025 12:55:54 PM
కేబినెట్ నిర్ణయం మేరకే ఆనకట్టల నిర్మాణం
ముగిసిన ఎంపీ ఈటల రాజేందర్ విచారణ
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) విచారణ ముగిసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శుక్రవారం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై(Kaleshwaram Commission inquiry) ఈటల రాజేందర్ ను విచారించింది. కేబినెట్ నిర్ణయం మేరకే ఆనకట్టల నిర్మాణం జరిగిందని ఈటల పేర్కొన్నారు. సాంకేతిక కమిటీ, కేబినెట్ కమిటీ సిఫార్సు మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. సీడబ్ల్యూసీ, మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా లొకేషన్ మార్పు చేసినట్లు తెలిపారు.
ప్రాజెక్ట్ లొకేషన్ తుమ్మిడిహట్టి నుంచి నుంచి మేడిగడ్డకు మార్చినట్లు ఆయన వివరించారు. నిధుల కొరత దృష్ట్యా కాళేశ్వరం కార్పోరేషన్ ఏర్పాటు చేసినట్లు ఎంపీ ఈటల తెలిపారు. పారిశ్రామిక, తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయాలని డీపీఆర్ లో ఉందని వెల్లడించారు. పారిశ్రామిక, తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయలేదని ఈటల వెల్లడించారు. బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా? అని కమిషన్ ఈటలను ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణ అంశాలన్నీ నీటిపారుదల శాఖ కిందకే వస్తాయని ఈటల కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) కు సూచించారు.