calender_icon.png 9 February, 2026 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సరీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

09-02-2026 03:57:09 PM

వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని బంబార గ్రామపంచాయతీలోని నర్సరీలో చేపడుతున్న పనులను ఎంపీడీవో జ్యోత్స్న సోమవారం పరిశీలించారు. అలాగే గ్రామ పంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, దిశా పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న వంటశాల పనులను కూడా ఆమె పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ... గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో ఆరు వేలకుపైగా మొక్కలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరితగతిన బ్యాక్‌ఫిల్లింగ్ పూర్తి చేసి విత్తనాలు వేయాలన్నారు. మొక్కల ఎదుగుదలకు అవసరమైన జీవామృతాన్ని తయారు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెండారే కృష్ణాజీ, పంచాయతీ కార్యదర్శి ధర్మయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ చారి, నర్సరీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.