14-01-2026 02:17:28 AM
బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
రాజేంద్రనగర్ జనవరి 13, ( విజయక్రాంతి): సంక్రాంతి పర్వదిన వేడుకగా ఆడపడుచులు మన ఇంటి ముందు వేసే ముగ్గులు తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక గా నిలుస్తాయని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. మంగళవారం కాటేదాన్ స్పోరట్స్ కాంప్లెక్స్ లో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మైలార్డెవ్ పల్లి డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు . ఎస్. వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమానికి అయన ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
వేడుక లో పలువురు మహిళలు పాల్గొని అందమైన ముగ్గులు వేశారు. ఇందులో ప్రతిభ ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొలన్ సుభాష్ రెడ్డి ఎస్. వెంకటేష్, cడి. రమేష్ ముదిరాజ్ నోముల రాము యాదవ్ అక్కేమ్ రఘు యాదవ్ బండ రాజేష్ యాదవ్ ఉప్పల్ శ్రీను ప్రవీణ్ సన్నీ సునీల్ పోతరాజు రమేష్ గారు , శ్రీమతి. కే. లక్ష్మీ , సరిత , భూదేవి రెడ్డి , సుగుణమ్మ , లక్ష్మి ప్రసన్న , పుష్ప , లలిత , శిరీష , సారిక , కృష్ణవేణి , మైసిరెడ్డి గంజి రాజు సమ్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఎర్లపల్లి ప్రవీణ్ మహేందర్ ముదిరాజ్ కొంపల్లి జగదీష్ నరేష్ యాదవ్ అశోక్ నానీ మధు చారి కృష్ణ ముదిరాజ్ లు పాల్గొన్నారు.