13 April, 2026 | 1:48 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

ఘనంగా ముక్కోటి ఏకాదశి..

30-12-2025 02:31 PM

ఉత్తర ద్వారం దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు

తాండూరు,(విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూర్  నియోజకవర్గంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానంగా తాండూరు మండలం చంద్రగిరి (దస్తగిరి పేట)లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు వేకువ జాము నుండే భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారు మ్రోగింది. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. మరోవైపు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వాహకులు క్యూలైన్ భారీకేడ్లు ,త్రాగునీరు తదితర ఏర్పాట్లు  చేశారు.