calender_icon.png 23 September, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి

23-09-2025 05:37:50 PM

ట్రాయ్ కాగ్ సభ్యుడు ప్రభాకర్ రావు

నిర్మల్,(విజయక్రాంతి): టెలికాం వినియోగదారులు, సామాన్య ప్రజలు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కాగ్ సభ్యుడు రావూరి పరభాకర్ రావు అన్నారు. టెలికాం, సైబర్ నేరాలపై జిల్లా కేంద్రం లోని వశిష్ఠ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టెలికాం వినియోగదారుల హక్కుల కోసం భారత ప్రభుత్వం 1997 లో ట్రాయ్ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. అవాంఛిత మొబైల్ కాల్స్ నియంత్రణ కోసం ట్రాయ్ 1909 నంబర్ కేటాయిందని తెలిపారు.

టెలి మార్కెటింగ్ కాల్స్ ని అడ్డుకోవడానికి డీఎన్డీ యాప్ డౌన్‌లోడ్(DND App) చేసుకోవాలని సూచించారు. 2025 అందరూ బ్రాడ్ బాండ్ వినియోగించేలా దేశ వ్యాప్తంగా 7 లక్షల గ్రామాలలో అంతర్జాల సేవలను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. సైబర్ నేరానికి గురైతే 1930 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ ఎస్డిఇ గోవిందు, AFO రమణ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అఖిలేశ్ కుమార్ సింగ్, ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ కంపెనీ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.