calender_icon.png 30 May, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టార్‌గా నా పుట్టిల్లు తెలుగే

23-05-2025 12:00:00 AM

కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను హీరో నితిన్ తండ్రి ఎన్ సుధాకర్‌రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం జూన్ 5న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం గురువారం హైదరాబాద్‌లో మీడియా మీట్ నిర్వహించారు.

ఈ సమావేశంలో కథానాయకుడు కమల్‌హాసన్ మాట్లాడుతూ.. “ఒక దర్శకుడిగా మణిరత్నం ‘నాయకుడు’ సినిమాతో ఎలా అయితే అందరినీ సర్ర్పైజ్ చేశారో.. ‘థగ్‌లైఫ్’తో కూడా ఆయన ప్రేక్షకులను సర్ర్పైజ్ చేయబోతున్నారు. నన్ను ద్రోణాచార్యతో పోల్చారు. కానీ నేను ద్రోణాచార్యున్ని కాదు. నేను ఇంకా విద్యార్థినే. ఒకరికి నేర్పాలంటే మనం ముందు నేర్చుకోవాలి. నేనింకా నేర్చుకుంటూనే ఉన్నా.

మీరూ నాతోపాటు కలిసి నేర్చుకోండి. నేను మణిరత్నం సినిమాలో యాక్ట్ చేయను.. జస్ట్ బిహేవ్ చేస్తాను. మేమంతా సినిమా అభిమానులం. సినిమాను ఎప్పుడూ భుజాలపై మోస్తాం. ఏదైనా సినిమానే మాకు నేర్పింది. అందుకే ఒక సినిమా విద్యార్థిగానే నన్ను నేను చెప్పుకుంటాను. నేను మనసుపెట్టి చేసిన ప్రతి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. ‘థగ్‌లైఫ్ ’ మనసుపెట్టి చేసిన సినిమా. ‘నాయకుడు’ కంటే పెద్ద విజయం సాధిస్తుంది.

ఇది నా ప్రామిస్. ఇంత మంచి సినిమా మళ్లీమళ్లీరాదు. అందుకే నా శక్తి వంచన లేకుండా ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. జూన్ 5న సినిమా వస్తోంది. సినిమా చూసిన తర్వాత మరింత గొప్పగా సెలబ్రేట్ చేసుకుందాం. నేను తెలుగులోనే స్టార్‌గా ఎదిగాను. స్టార్‌గా నేను పుట్టిన ఇల్లు తెలుగు. అందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు.” అన్నారు. డైరెక్టర్ మణిరత్నం మాట్లాడుతూ.. “కమల్‌హాసన్‌తో ఫస్ట్ టైమ్ కలిసి నాయకుడు సినిమా చేశాను.

ఇన్నేళ్ల తర్వాత సెకండ్ సినిమా అవకాశం ఆనందంగా ఉంది. ఆయన ‘నాయకుడు’ సమయంలో ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలానే ఉన్నారు. నేను డైరెక్టర్ కాకముందు నుంచి ఆయన్ని చూస్తున్నా. ఆయనలో ఏ మార్పూ లేదు. దర్శకుడు ఏమనుకుంటున్నాడో అర్థం చేసుకొని సపోర్ట్ చేసే హీరో కమల్‌హాసన్’ అని చెప్పారు. ‘నేను ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది.

ద బెస్ట్ టాలెంట్ కలిసి ఒక సినిమాతో మీ ముందుకు వస్తున్నారు. ప్రేక్షకుల మీద చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. ఆడియన్స్ కూడా అంత గొప్పగా ఆదరిస్తారని నమ్మకం ఉంది” అని సుహాసిని మణిరత్నం తెలిపారు. హీరోయిన్ త్రిష మాట్లాడుతూ.. ‘నాకు హైదరాబాద్ సెకండ్ హోమ్ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ సినిమా ఒక బ్యూటీఫుల్ జర్నీ.

నేను నాయకుడు సినిమా చూస్తూ పెరిగాను. ఇప్పుడు మణిరత్నం, కమలహాసన్‌లతో కలిసి పనిచేసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు. నిర్మాత సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రీవియస్ సినిమాలు రెండు నేనే రిలీజ్ చేశాను.

ఆ రెండూ బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. ఈ ట్రైలర్, సాంగ్స్ చూసిన తర్వాత ఈ సినిమా మెగా బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్మకం ఏర్పడింది. కమల్ సార్ కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు శింబు, అభిరామి, నాజర్, తనికెళ్ల భరణి, అశోక్ సల్వన్ పాల్గొన్నారు.