నాచగిరి నారసింహుడికి శతఘటాభిషేకం
23-05-2024 06:51 AM
గజ్వేల్, మే 22 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నాచగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం శతఘటాభిషేకం నిర్వ హించారు. స్వామివారి జయంతిని పురస్కరించుకుని మూడురోజులుగా నాచగిరి క్షేత్రంలో విశేషపూజలు జరుగుతున్నాయి. బుధవారం నృసింహ జయంతి సందర్భంగా మూలమంత్రహవనము, మహాపూర్ణాహుతి, శతఘటాభిషేకం, పంచామృతాభిషేకాలు, స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించా రు. ఉత్సవాల్లో గురుమాధవానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతి, గజ్వేల్ కోర్టు జడ్జి ప్రియాంక పాల్గొన్నారు. అనంతరం వా రిని ఆలయ అర్చకులు సన్మానించారు.






