29-07-2025 04:42:08 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District)లో నాగుల చవితి పంచమి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో మంగళవారం జరుపుకున్నారు. ఉదయం నుండి మహిళలు ఆయా గ్రామాల్లో గల నాగదేవత విగ్రహాలతో పాటు పుట్టల వద్ద వెళ్లి పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. బైంసా సుంకిలి చిట్యాల ఎన్టీఆర్ ట్యాంక్బండ్ దుర్గామాత ఆలయం అయ్యప్ప క్షేత్రం తదితర ప్రాంతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు.