13-12-2024 12:15:01 AM
మహబూబాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): దంతాలపల్లి నుంచి రవాణా అవుతున్న 30 క్వింటాళ్ల నల్లబెల్లాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం నుంచి నల్లబెల్లం తరలుతున్నదని సమాచారం అందుకున్న పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యాన్లో 30 క్వింటాళ్ల నల్లబె ల్లంతో పాటు క్వింటా పటికను స్వాధీ నం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి ఒకరిపై కేసు నమోదు చేశారు.