బిఆర్ఎస్ నేత మోరీల్ శ్రీనివాస్ను సన్మానించిన నసురుల్లాబాద్ నాయకులు
21-08-2026 02:30 PM
బాన్సువాడ, ఆగస్టు 21 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మోరీల్ శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోడిసెల నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, వెంకట్ సార్, గంపల శంకర్, రమేష్, రాము, రాజు, బాబు, కృష్ణ, శ్రీనివాస్, మోహిసిన్, అక్తర్, సాయికుమార్, భాస్కర్, సాయిలు, గంగారం, దశరథ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






