9 April, 2026 | 9:05 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి

03-07-2025 12:51 AM

ఎస్పీ కిరణ్ ఖరే 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జులై 2, (విజయ క్రాంతి): ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పోలీసులు, వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. బుధవారం టేకుమట్ల పోలీస్ స్టేషన్ ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, సిబ్బంది వివరాలు, రికార్డుల నిర్వహణ, కేసుల పురోగతి, నేరాలు జరిగే ప్రాంతాలు, తీసుకుంటున్న రక్షణ చర్యలు, శాంతి భద్రతల పర్యవేక్షణ, సంఘ వ్యతిరేక కార్యకలాపాల గురించి సమీక్షించారు.

సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ బాధితులకు న్యాయం జరిగే విధంగా పోలీసులు పని చేయాలన్నారు. నేరాల అదుపుకు పెట్రోలింగ్ నిర్వహించాలని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు అమర్చి పనిచేసే విధంగా చూడాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని, ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా రక్షణ చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సిబ్బంది పనితీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు, చిట్యాల సిఐ మల్లేష్, టేకుమట్ల ఎస్‌ఐ సుధాకర్, సీసీ ఫసియోద్దిన్ పాల్గొన్నారు.