28 June, 2026 | 3:43 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

అల్లు అరవింద్‌ని ప్రశ్నించిన ఈడీ

04-07-2025 02:31 PM

హైదరాబాద్: సినీ నిర్మాత అల్లు అరవింద్ ను ఈడీ(Enforcement Directorate) అధికారులు ప్రశ్నించారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ పై మానీలాండరింగ్ కేసు నమోదైంది. హైదరాబాద్, కర్నూలు, ఘజియాబాద్ సహా పలు చోట్లు ఈడీ సోదాలు చేసింది. రూ. 101.4 కోట్ల రుణ నిధులను మళ్లించారని ఈడీ గుర్తించింది. ఆయా సంస్థల డైరెక్టర్లపై బెంగళూరులో సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు మూడు గంటల పాటు ఈడీ విచారణ కొనసాగింది. రామకృష్ణ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి, అల్లు అరవింద్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది.