27-06-2025 07:11:13 PM
గీతా పనివారల సంఘం రాష్ట్ర కార్యదర్శి పబ్బు వీరస్వామి
చండూరు,(విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గంలో నీరా పరిశ్రమను ఏర్పాటు చేసి కల్లు గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని పంపు వీరస్వామి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం గీతా పనివారాల సంఘం చండూరు మండల 15వ మహాసభ సిపిఐ కార్యాలయం ఆధగోని నరసింహ భవనంలో గంటా రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గీత పనివార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి పబ్బు వీరాస్వామి హాజరై మాట్లాడుతూ... గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
వృత్తి ని నమ్ముకొని జీవనోపాధి చేస్తున్న గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్ల పై నుండి పడితే పాత పద్ధతితో మెడికల్ సర్టిఫికెట్ ద్వారానే ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. గీతా పనివారల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడిగె సైదులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి గీతా కార్మికుడికి వృత్తి పెన్షన్ మంజూరు చేయాలి డిమాండ్ చేశారు. చెట్టు ఎక్కే ప్రతి గీతకార్మికుడికి సేఫ్టీ యంత్రాలను అందజేయాలని అన్నారు. గీత వృత్తికి సమగ్ర చట్టం కల్పిపించి స్కిల్ యూనివరిసిటీ లొ గీత వృత్తి కి సంబందించిన శిక్షణ కల్పించాలి అన్నారు
కల్లుగీత కార్మికులకు ద్విచక్ర వాహానాన్ని మంజూరు చేయాలని, తాటి ఈత వనాల పై గీతకార్మిక సొసైటీలకు చెట్టు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నల్ప రాజు రామలింగయ్య, సిపిఐ మండల కార్యదర్శి నల్పరాజు సతీష్ కుమార్, గీత పనివారాల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పల్లె శంకరయ్య, సిపిఐ మండల సహాయ కార్యదర్శి బొడ్డు వెంకటేశ్వర్లు, గీతా పనివార్ల సంఘం మండల అధ్యక్షుడు గంట నగేష్, బరిగల వెంకటేష్, బండమీది వెంకన్న, పాలకూరి సత్తయ్య, గడ్డం నవీన్,పల్లె నరసింహ, బోయపల్లి అంజయ్య, గుణ గంటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.