3 July, 2026 | 11:01 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

రిస్క్ వద్దనే: నీరజ్

27-05-2024 01:17 AM

న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్, ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా తాను గాయపడినట్లు వచ్చిన వార్తలను ఖండించాడు. తానేమీ గాయపడలేదని ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు ముందు అనవసర రిస్క్ వద్దనే ఒస్త్రాకా గోల్డెన్ మీట్ నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నాడు. గాయంతో ఈ నెల 28న జరగనున్న ఒస్త్రావా గోల్డెన్ స్పైక్ మీట్‌కు నీరజ్ దూరమైనట్లు వార్తలు వచ్చాయి. ‘నేనేమీ గాయపడలేదు. ఇటీవలే ఫెడరేషన్ కప్‌లో బరిసె త్రో చేయడంలో కాస్త ఇబ్బంది ఎదురైంది. అందుకే ఎక్కువ శ్రమ తీసుకోలేదు. నేను గాయపడినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు ముందు రిస్క్ వద్దనే ఒస్త్రాకా గోల్డెన్ మీట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. పూర్తిగా కోలుకొనే విశ్వక్రీడలకు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకున్నా’ అని వెల్లడించాడు.