3 July, 2026 | 11:53 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

శ్రీహరికి రజతం

27-05-2024 01:14 AM

పారిస్: భారత స్టార్  స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ మేర్ నోస్ట్రమ్ స్విమ్మింగ్ ఈవెంట్‌లో పతకంతో మెరిశాడు. ఫ్రాన్స్ వేదికగా ఆదివారం జరిగిన 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్ ఫైనల్లో నటరాజ్  25.50 సెకన్లలో గమ్యాన్ని చేరి రజతం సొంతం చేసుకున్నాడు. హంగేరీకి చెందిన ఆడమ్ జాస్జో (25.46 సెకన్లు) స్వర్ణం దక్కించుకోగా.. స్కాట్ గిబ్సన్ (25.64 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నాడు. అయితే ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు స్విమ్మింగ్ విభాగంలో ఇప్పటివరకు భారత్ నుంచి ఒక్కరు కూడా అర్హత సాధించలేకపోయారు. గతంలో సాజన్ ప్రకాశ్, శ్రీహరి నటరాజ్‌లు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే.