నీట్ను రద్దు చేయాలి
ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ఓయూలో సంతకాల సేకరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (విజయక్రాంతి): నీట్ను రద్దు చేయాలని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. నీట్ అభ్యర్థుల సమస్యల పరిష్కారం కోసం ఉస్మానియా యూని వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట బుధవారం సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్ మాట్లాడుతూ. నీట్ రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ ఓయూ అధ్యక్షుడు మేడ శ్రీను, ఉపాధ్యక్షురాలు సూర చందనరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అభిజిత్ యాదవ్, ఓయూ ఇన్చార్జి శ్రీకర్, నాయకులు వంశీ, వెంకట్, సాయి ఓంకార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






