29 June, 2026 | 12:34 AM

నీట్ పరీక్ష రద్దు 2026: పేపర్ లీక్ ఎలా జరిగింది? విద్యార్థులకు తర్వాత ఏమిటి?

12-05-2026 02:47 PM

దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులను షాక్‌కు గురిచేస్తూ, NEET 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రశ్నాపత్రం పరీక్షకు ముందే లీక్ కావడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అనిశ్చితిలో పడింది.

న్యూఢిల్లీ: : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం NEET UG పరీక్ష కోసం 22.79 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్న నేపథ్యంలో మే 3, 2026న నిర్వహించిన NEET UG 2026 పరీక్షను రద్దు చేయాలని, అలాగే ఆ పరీక్షను తదనంతరం తెలియజేసే తేదీలలో తిరిగి నిర్వహించాలని భారత ప్రభుత్వ ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. 

  • “విద్యార్థులు నెలల తరబడి చేసిన కష్టం ఒక్కసారిగా వృథా అయ్యిందనే ఆవేదన వ్యక్తమవుతోంది.”

  • విద్యా వార్తలపై మరిన్ని అప్‌డేట్స్  కోసం విజయక్రాంతి న్యూస్‌ను ఫాలో అవ్వండి.

నీట్  యూజీ ప్రశ్న పత్రం లీక్ వార్తల నేపథ్యంలో కేంద్రం పరీక్ష రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ పై కేంద్రం సీబీఐ దర్యాప్తనకు ఆదేశించింది. విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఎన్టీఏ ప్రకటించింది.

రాజస్థాన్ లోని కోటాలో నీట్ యూజీ పశ్నాపత్రం లీకైనట్లు అధికారులు గుర్తించారు. కోటాలో కోచింగ్ సెంటర్లు ఇచ్చిన మెటీరియల్ తో పోలిఉన్నట్లు గుర్తించారు. కెమిస్ట్రీలో 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీసు పేపర్ వెలుగులోకి వచ్చింది. ప్రశ్నాపత్రం లీకైనట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సల్ వెల్లడించారు. పరీక్షకు 42 గంటల ముందు వాట్సప్ లో మెటీరియల్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. రాజస్థాన్ లోని సికార్ లో ఈ మెటీరియల్ అందుబాటులోకి వచ్చినట్లు గుర్తించారు.

దేశవ్యాప్తంగా విద్యా, రాజకీయ తాజా అప్డేట్స్ కోసం నేషనల్ వార్తలను చదవండి.

విద్యార్థులకు రూ. 20 వేల నుంచి రూ. 2 లక్షలకు విక్రయించారని అదనపు డీజీపీ వివరించారు. కొందరు అభ్యర్థుల నుంచి ముందగానే రూ. 30 వేలకు పైగా వసూలు చేశారని అధికారులు గుర్తించారు. దర్యాప్తు సంస్థలతో ఎన్ టీఏ కలిసి పనిచేస్తున్నామని ప్రకటించింది.

NTA మే 6న NEET UG తాత్కాలిక జవాబు కీని (provisional answer key) విడుదల చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం, భారతదేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో, 5,432కు పైగా కేంద్రాల్లో సుమారు 22.79 లక్షల మంది నమోదిత అభ్యర్థుల కోసం ఈ పరీక్ష నిర్వహించబడింది. దీనితో NEET UG ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షలలో ఒకటిగా నిలిచింది. 

విద్యార్థులకు తర్వాత ఏమిటి?
కేంద్రం ఇప్పటికే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. మళ్లీ పరీక్ష నిర్వహణపై త్వరలో తేదీలు ప్రకటిస్తామని తెలిపింది. అయితే విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ఇలాంటి విద్యా వార్తలు కోసం మా ఎడ్యుకేషన్ విభాగాన్ని సందర్శించండి

పరీక్షా కేంద్రాల వద్ద స్వతంత్ర పర్యవేక్షణ కోసం 6,000 మందికి పైగా పరిశీలకులను నియమించినట్లు NTA ఇంతకుముందు ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. NEET UG 2026 పరీక్ష సజావుగా జరిగేలా చూడటానికి రెండు లక్షల మందికి పైగా సిబ్బందిని మోహరించారు.

FAQ's

Q: NEET 2026 ఎందుకు రద్దు చేశారు?

పేపర్ లీక్ కారణంగా.

Q: మళ్లీ పరీక్ష ఎప్పుడు?

త్వరలో తేదీలు ప్రకటిస్తామని కేంద్రం తెలిపింది.

Q: మొత్తం ఎంత మంది విద్యార్థులు?

ఈసారి NEET పరీక్షకు దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రద్దు కావడంతో వారి భవిష్యత్తు ప్రస్తుతం అనిశ్చితిలో పడింది.

ఇవి కూడా చదవండి:

NEET-UG 2026 cancelled: కేంద్రంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

NEET Exam Cancelled 2026: విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం

నీట్‌ పరీక్ష రద్దు: కేవలం వైఫల్యం మాత్రమే కాదు.. నేరం