13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

"ఓ వైపు స్వచ్ఛ సర్వేక్షణ్.. మరోవైపు పొంగుతున్న మోరీలు!

13-01-2026 11:12 AM

సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్ కాలనీలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. గత మూడు నాలుగు రోజులుగా మోరీలు పూడికతో నిండిపోయి, మురుగు నీరు రోడ్లపైకి వచ్చి చేరుతోంది. కాలనీ అంతా దుర్వాసనతో అట్టుడికిపోతుండగా, మున్సిపల్ యంత్రాంగం మాత్రం మొద్దు నిద్రలో ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​మురికి నీటిలోనే స్కూలు చిన్నారుల ప్రయాణం

అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, మురుగు నీరు ప్రవహిస్తున్న రోడ్డుపైనే పాఠశాల ఉండటంతో చిన్న పిల్లలు ఆ మురికిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ప్రభుత్వం స్వచ్ఛత గురించి గొప్పలు చెబుతున్నా, కనీసం పాఠశాల వెళ్లే దారిని కూడా శుభ్రంగా ఉంచలేకపోవడం అధికారుల అసమర్థతకు నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. నిలిచి ఉన్న నీటితో దోమలు పెరిగి చిన్నారులు డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. తక్షణమే అధికారులు స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు.