ఇస్సన్నపల్లిలో నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశం
05-03-2026 12:56 PM
భిక్కనూర్, మార్చి05(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం ఇస్సన్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాల గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు వస్త్రాలు బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాలు పేదల జీవితాల్లో మార్పు తీసుకువస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ మేకల రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు,ప్రజాప్రతినిధులు, యువకులు , గ్రామస్తులు పాల్గొన్నారు. నూతన ఇళ్లలో ప్రవేశించిన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు తెలిపారు.




