03-05-2025 08:18:07 PM
గద్వాల (విజయక్రాంతి): నూతన లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎల్.శ్రీనివాస రావు భాద్యతలు చేపట్టి జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ ను కలిసి పూల మొక్కను అందజేశారు. ఎల్.శ్రీనివాస రావు గతంలో నాగర్ కర్నూల్ పనిచేశారు. గద్వాల్ జిల్లాలో ఈ పదవిలో ఉన్న అయ్యప్పు రెడ్డి బదిలీ కావడంతో శ్రీనివాస రావు ఈ బాధ్యతలకు నియమించారు.