1 May, 2026 | 9:28 PM

న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించాలి

01-05-2026 08:03 PM

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ 

హనుమకొండ,(విజయక్రాంతి): పోలీసుల వద్దకు వెళ్ళితే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఇన్స్ స్పెక్టర్ల నుండి ఏసీపీ లుగా పదోన్నతి పొందిన గొర్ల సీతారెడ్డి, బోలగాని శ్రీనివాస్ గౌడ్, సార్ల రాజులు శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సీపీ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పదోన్నతులతో పాటు బాధ్యతలు పెరుగుతాయని, నిరంతరం క్రింది స్థాయి అధికారుల పని తీరును పర్యవేక్షణ చేయడంతో వారి దిశా నిర్దేశం చేయాలని, పోలీస్ శాఖ గౌరవం మర్యాదలు పెంపొందించే విధంగా విదులు నిర్వర్తించాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.