17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

యాదయ్యకు నూతన సర్పంచ్ సంతోష్ యాదవ్ పరామర్శ..

14-12-2025 06:43 PM

మర్రిగూడ (విజయక్రాంతి): మండలంలోని యరగండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ గార్లపాటి యాదయ్య తండ్రి ముత్తయ్య ఆదివారం మరణించారు. విషయం తెలుసుకున్న నూతన గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి దహన సంస్కారాల కొరకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ముత్తయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సానుభూతి వ్యక్తపరచిన ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు.

ప్రజాభిమానంతో సర్పంచిగా గెలుపొందిన తాను ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని అన్నారు.ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆదరించి తనని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై అభిమానంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకి సర్పంచిగా తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని, గ్రామ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళతానని అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను అండగా నిలబడి ఆదుకుంటానని హామీ ఇచ్చారు.ఆయన వెంట వార్డు సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.