14-06-2025 12:05:00 AM
గద్వాల, జూన్ 13 ( విజయక్రాంతి ) : రైతులు ఎదుర్కొంటున్న పత్తి విత్తనాల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా, కంపెనీ లపై నియంత్రణతో పాటు రైతుల హక్కులను బలపరిచే కొత్త విత్తన చట్టం త్వరలో అమలులోకి రానుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ,రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అన్నారు.
శుక్రవారం గద్వాల మండల పరిధిలోని పుటన్పల్లి గ్రామంలో పత్తి విత్తనాల పంటలపై కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులను నేరుగా కలుసుకుని వారి సమ స్యలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్ ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అధ్యక్షతన విత్తన పత్తి పంటకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న స మస్యలను చర్చించేందుకు, సమస్య పరిష్కారానికి అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగా ణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో రైతులు శ్రమతో సాగు చేస్తున్న పత్తి పంట దేశీయంగా మాత్రమే కాకుండా చైనా వంటి దేశాలకు పోటీ ఇవ్వగల స్థాయిలో ఉందని, ఇది రాష్ట్ర గర్వకారణ మని తెలిపారు. గద్వాలలో పత్తి విత్తనాల సమస్యలు తీవ్రంగా ఉండటంతో, కమిషన్ క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని నిర్వహించి నట్లు తెలిపారు.
రైతులు పత్తి విత్తనాలు ఫెయిల్, అధిక వడ్డీ రేట్లతో అప్పుల్లో కూరుకుపోతూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీవ్రంగా బాధించేదిగా ఉందని తెలిపారు. రైతుల శాశ్వత రక్షణ కోసం కొత్త విత్తన చట్టాన్ని ప్రభుత్వం 1520 రోజుల్లో తీసుకురాబోతుందని, ఇది విత్తన కంపెనీలపై నియంత్రణతో పాటు రైతుల హక్కులకు రక్షణ కల్పించనుందని చెప్పారు.
వ్యవసాయ రంగంలో మహిళలకు ఎదురుపడుతున్న సమస్యలను కూడా పరిగణలోకి తీసుకుంటామని, మహిళ రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా అన్ని విధాలుగా న్యాయం చేస్తామని అన్నారు. ములుగు జిల్లాలో మొక్కజొన్న సమస్యపై కమిషన్ స్పందించి న్యాయం చేసిందని గుర్తుచేశారు.
గద్వాలలో విత్తనాల నాణ్యత, సరఫరా, కంపెనీల బాధ్యతపై స్పష్టత ఉండేందుకు రైతులకు మధ్యవర్తులతో సంబం ధం లేకుండా నేరుగా కంపెనీలతో సంబంధం పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వడ్డీ వ్యాపారం చేసే మనీ లెండర్లు లైసెన్స్తో పాటు ఆర్బీఐ నిబంధనల మేరకు వ్యవహరించాలని , లావాదేవీలపై కాలానుగుణంగా ఆడిట్ జరపాలని అధికారులను ఆదేశించారు.
అన్నదాతే దేశానికి వెన్నెముక అని, రైతే రాజు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకొని ప్రభు త్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం కమిషన్ చైర్మన్ వివిధ సమస్యలపై బాధితుల సమస్యల పరిష్కారంపై వినతి పత్రాలను సేకరించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ అలివేలు, కమిటీ సభ్యులు రాములు నాయక్, సునీల్ కుమార్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, కేవీ.నర్సిం హా రెడ్డి ,మారికంటి భవాని, అలంపూర్ మాజీ శాసన సభ్యు లు సంపత్ కుమార్,జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, జిల్లా అధికారులు, సీడ్ పత్తి ఆర్గనైజర్లు, కంపెనీ ప్రతినిధులు, రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.