27-06-2025 06:43:06 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు గురువారం విడుదల చేసిన పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలలో నిర్మల్ జిల్లా 98.31%తో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచిందని నిర్మల్ జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీ పి. రామారావు గారు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ లతో కలిసి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సోమవారపేట యందు ఈనెల 3 నుండి 11 వరకు జరిగిన ఈ పరీక్షలకు జిల్లా నుండి 296 మంది హాజరు కాగా 291 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలకు బాలురు 180 మంది హాజరుకాగా 175 మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు.
అదే విధంగా 116 మంది బాలికలు పరీక్ష రాయగా 116 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 100% ఉత్తీర్ణులు కాగా బాలురు 97.22% ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. రికౌంటింగ్ కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు 500 రూపాయల చెల్లించి 2025 జులై 7లోగా డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్ విభాగం హైదరాబాద్ కి నేరుగా పంపవలెనని పేర్కొన్నారు.అదేవిధంగా రివల్యూవేషన్ కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు 1000 రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించి తమ దరఖాస్తులను సంబంధిత హెడ్ మాస్టర్ల ద్వారా డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హైదరాబాదుకు 7 జులై 20 25 లోపు పంపించవలెనని తెలియజేశారు.