ఫేక్ వీడియోలపై ఫిర్యాదు తీసుకోవడం లేదు
03-05-2024 01:03 AM
పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని కొందరు తనపై ఫేక్ వీడియోలు చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేశారని, వారిపై ఫిర్యాదు చేస్తే 10 రోజులైనా పోలీసులు కేసు నమోదు చేయలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం అమలు చేస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లుగా అమిత్షాపై తప్పుడు వీడియోలు వైరల్ అయ్యాయని, దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారన్నారు. తన ఫిర్యాదుపైనా పోలీసులు అలాగే స్పందించాలని డిమాండ్ చేశారు.




