11 March, 2026 | 4:45 PM

Breaking News

మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి మృతిపై సంతాపం   •   ఒత్తిడిని వీడి.. పరీక్షలకు సిద్ధం కావాలి: ఏఎస్పీ   •   వాడి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం   •   కుంభాభిషేకం – తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు   •   హేమలత చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్: ఎమ్మెల్యే తలసాని   •   విమానంలో 133 మంది ప్రయాణికులు.. ఎయిరిండియాకు తప్పిన ముప్పు   •   సెన్సెక్స్ 1342 పాయింట్లు కుప్పకూలింది.. పెట్టుబడిదారులకు రూ.3 లక్షల కోట్ల షాక్ — కారణం ఇదే!   •   ప్రాణం తీసిన చేపల వేట.. కృష్ణా నదిలో గల్లంతైన అన్నదమ్ములు   •   భూ మాఫియా చేసింది మీరే.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు బినామీలు   •   అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు   •  

కరెంటు లేదు.. నీళ్లు లేవు..!

13-11-2025 12:58 AM
  1. మెనూ మాయం

హుస్నాబాద్ ఎస్టీ బాలకల కాలేజీహాస్టల్ లో దుస్థితి

వారంరోజులుగా చీకట్లో జీవనం

బీజేపీ నాయకుల సందర్శనతో వెలుగులోకి

హుస్నాబాద్, నవంబర్ 12 : సిద్దిపేట జి ల్లా హుస్నాబాద్ లోని ప్రభుత్వ గిరిజన బా లికల కళాశాల వసతిగృహంలో విద్యార్థినుల దుస్థితిపై ప్రభుత్వ నిర్లక్ష్యం అక్షరాలా కరెంటు స్తంభించినట్టు తేటతెల్లమైంది. వా రం రోజుల నుంచి కరెంటు లేక విద్యార్థినులు చీకట్లో తీవ్ర అవస్థలు పడుతున్నారని, కనీసం స్నానం చేయడానికి కూడా నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ హుస్నాబాద్ మండల అధ్యక్షుడు భూక్యా సంపత్ బృందం బుధవారం సాయంత్రం వసతి గృహాన్ని సందర్శించిన తర్వాత వెల్లడించింది.

సౌకర్యాలు లేకపోగా, మెనూ ప్ర కారం ఆహారం కూడా పెట్టడం లేదని విద్యార్థినులు తెలిపారు. ఈ విషయాలపై హాస్టల్ వార్డెన్ గాయత్రిని వివరణ కోరగా... ఆమె ఇచ్చిన సమాధానం మరింత విస్మయాన్ని కలిగించిందని సంపత్ అన్నారు. ‘కరెంటు రి పేర్ బిల్లులు మాకు ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్ కు ఇస్తున్నారు.

మేము ఎందుకు చేపిస్తా ము? కాంట్రాక్టర్ ని చేయించమని చెప్పం డి,‘ అని వార్డెన్ నిర్లక్ష్యంగా సమాధానం చె ప్పడం ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న బాధ్యతారాహిత్యాన్ని బట్టబయలు చేసిందని చెప్పారు. ఈ పరిస్థితులపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని డీటీడీవోను ఫోన్లో సంప్రదించగా, ఆయన ఫోన్ ఎత్తలేదన్నారు. బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన ఈ కీలక అంశంపై అధికారుల స్పందన లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.