11 July, 2026 | 2:06 PM

Breaking News

మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •   డంపింగ్ యార్డ్ తరలింపు వ్యతిరేక ఉద్యమాన్ని ఆపలేరు: ఎంపీ ఈటెల రాజేందర్   •  

మనస్పర్థలు వద్దు!

29-06-2025 12:00 AM

చాలావరకూ గొడవలు ఎందుకొస్తాయో తెలుసా? సరిగా కమ్యూనికేషన్ లేకే. ఇద్దరూ తమ వాదన చెబుతారే కానీ.. అవతలి వాళ్ల కోణమేంటో తెలుసుకోరు. అర్థం చేసుకోవట్లేదని తిరిగి ఇద్దరూ బాధపడుతుంటారు. ఏ విషయంలోనైనా గొడవొచ్చినా మనస్పర్థలు ఎదురైనా ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చోండి. ముందు అయిదు నిమిషాలు ఒకరు మాట్లాడాలి. ఆ సమయంలో ఎదుటివ్యక్తి నోరు విప్పకూడదు.

మాట్లాడేవారూ ఎదుటివారిని నిందించకుండానే సమస్య గురించి చెప్పాలి. సమయం పూర్తవగానే మరొకరు తమ మనసు విప్పాలి. ఇద్దరి కోణాలూ తెలుస్తాయి. ఎదుటివారిని నిందించొద్దు కాబట్టి.. మొదట మాట్లాడే వ్యక్తి దృష్టంతా సమస్య మీదే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఇక రెండో వాళ్లు తర్వాత వాళ్లకి సమాధానమివ్వాలని చెప్పింది జాగ్రత్తగా వింటారు.

మొదటివాళ్లలాగే వీళ్లూ తమ కోణాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటూ చెబుతారు. నిందించడాలు లేనప్పుడు కేవలం సమస్యే తెరమీదకి వస్తుంది. కాబట్టి పరిష్కారం కనుక్కోవడం సులువవుతుంది. ఇద్దరు మనసు విప్పి మాట్లాడతారు. అంటే కమ్యూనికేషన్ జరుగుతుంది. దీంతో పరిష్కారం దిశగా ఆలోచించడం మొదలు పెడతారు. కలిసి పరిష్కరించుకుంటారు.