09-06-2025 01:58:52 AM
ఘట్ కేసర్, జూన్ 8 (విజయక్రాంతి) : అవుషా పూర్ గ్రామ నాభిశిల బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా ఆదివారం మహిళలు నైవేద్యంతో కూడిన బోనా లు సమర్పించారు. ఉదయం నుండి సాయంత్రం వరకుమహిళలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి నా భిశిల బొడ్రాయి ప్రతిష్టించిన స్థలానికి చేరుకొని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
అవుషాపూర్ గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా మంచి జరగాలని ఈసందర్భంగా కోరుకున్నట్లు ప్రజలు తెలిపారు. నాభిశిల బొడ్రాయి ప్రతిష్ఠాపన సందర్భంగా బోనాల సమ ర్పణతో అవుషాపూర్ ప్రాంతమంతా పండగ వాతా వరణం నెలకొంది.
బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్య దర్శి పన్నాల కొండల్ రెడ్డి ఆహ్వానం మేరకు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నాభిశిల బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. మాజీ ప్రజాప్రతినిధులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు తమ బంధుమిత్రులతో బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.