calender_icon.png 31 July, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనుల్లో అధికారులు అలసత్వం వీడాలి

30-07-2025 01:45:58 AM

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

కూకట్‌పల్లి జులై 29 (విజయక్రాంతి):  కూకట్ పల్లి నియోజకవర్గంలో నిధులు మంజూరైనప్పటికీ అభివృద్ధిలో చేపట్టంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని కూక ట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  వివిధ శాఖల అధికారుల తో నియోజకవర్గంలోని సమస్యల పై సమీ క్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా నియోజకవర్గంలోని నాళాలు, డ్రైనేజీ అభివృద్ధి పనుల కోసం గతంలోని 103  కోట్లు నిధులు కేటాయించిన పనుల్లో ఎందు కు అలసత్వం చూపుతున్నారని అధికారులపై అసహన వ్యక్తం చేశారు. 

రామా రావు నగర్ నాల అభివృద్ధి విషయంలో అదేవిధంగా భరత్‌నగర్ వద్ద నాల నిర్మాణంలో మైసమ్మ చెరువు నుంచి పనులు చేపట్టక పోవడంపై అధికారులను ప్రశ్నించారు. ఫతేనగర్ లోని దీన్ దయాల్ నగర్, జింకలవాడ నాలా అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కేపిహెచ్పి డివిజన్ కల్వరి టెంపు ల్ వద్ద పైప్లైన్ నిర్మాణం డ్రైనేజ్ అభివృద్ధి కొరకు  నిధులు కేటాయించినా పనులు ఎందుకు చేపట్టడం లేదని అడిగారు. కేపిహెచ్బి డివిజన్‌లో పెరుగుతున్న హాస్టల్స్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతుందని కెపిహెచ్బిలో ముఖ్యంగా హాస్టల్స్ వల్ల సమస్య తలెత్తుతుందని అన్నారు.

ఎలాంటి పర్మిషన్స్ లేకుండా 1800 హాస్టల్స్ ఉన్నాయని టౌన్ ప్లానింగ్ అధికారులు విచ్చల విడిగా పర్మిషన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్టర్‌లు జాప్యం వహిస్తూ వారికి నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారన్నారు. అలాంటి వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని పేర్కొన్నారు. అధికారులు ఏదైనా వర్క్ స్టార్ట్ అయ్యే ముందు సమాచారం ఇవ్వడం లేదని కార్పొరేటర్లకు గౌరవం లేదని మండిపడ్డారు. కూకట్‌పల్లికి ఫండ్ విషయంలో అన్యాయం జరింగిందన్నారు. పక్క నియోజక వర్గంలో మంచి రోడ్లు తవ్వి రోడ్లు వేస్తున్నారు అని ఆరోపించారు. బాలనగర్ డివిజన్ ఇందిరానగర్, శ్రీశ్రీనగర్‌లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను త్వరగా పూర్తి చేయాలని అన్నారు.

ఎక్కడికక్కడ వీధి దీపాలు పునరుద్ధరించాలని తెలిపారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయక త్వంలో కూకట్‌పల్లిలో డ్రైనేజ్ వ్యవస్థ దాదా పు 80% పూర్తి చేసుకున్నామని అలాగే వాటర్ వరక్స్ పనులు 90% పూర్తి చేసుకున్నామని ఆనాడు త్వరితగతిన పనులు పూర్తి చేసుకోబట్టే నాడు నియోజకవర్గంలో కొంత మేర అయిన ఊపిరి పీల్చుకోగలుగుతున్నామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నియోజక వర్గంలో రోడ్లు, డ్రైనేజ్ ,నాలాల విషయం లో అలసత్వం వహించవద్దని అలాగే నూతనంగా మంజూరైన పనులకు త్వరగా టెండ ర్లు పూర్తి చేసి పనులు ప్రారంభం అయ్యేలా వెంటనే చర్యలు తీసుకోవాలని పనులు త్వరగా పూర్తిచేసి తదుపరి సమావేశానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముద్దం నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, సభిహ గౌసుద్దీన్, మందడి శ్రీనివాసరావు, పగుడాల శిరీష బాబురావు, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్, మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.