calender_icon.png 20 June, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో ఒలంపిక్ రన్

19-06-2025 07:17:20 PM

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి..

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్(Telangana State Olympic Association) ఆదేశాల మేరకు గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒలంపిక్ రన్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డితో ప్రారంభించారు. కామారెడ్డి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు ఒలంపిక్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి ఆర్డీవో వీణ, జిల్లా యువజన శాఖ అధికారి జగన్నాథం, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, ఒలంపిక్ కార్యక్రమ కన్వీనర్ కరుణాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, ఫిజికల్ డైరెక్టర్, రంగా రమేష్ గౌడ్, ఫిజికల్ డైరెక్టర్లు, యువజన సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.