13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఒక ప్రమాదం.. జీవితకాలం ప్రభావం

14-01-2026 12:04 AM

ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్

నాగర్ కర్నూల్, జనవరి 13 (విజయక్రాంతి ): అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ వంటి కారణాల చేత జరిగిన ఒక ప్రమాదం ఆ వ్యక్తులపై జీవితకాలం ప్రభావం చూపుతుందని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎర్రివ్ అలివ్  కార్యక్రమంలో భాగంగా రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను భయంతో కాదు, బాధ్యతతో పాటించాలన్నారు.

రోడ్డు ప్రమాదాలు ఒక్క క్షణంలో జరిగి కుటుంబాలపై జీవితకాల ప్రభావం చూపుతాయని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్/సీట్బెల్ట్ ధరించకపోవడం, మొబైల్ ఫోన్ వాడకం ప్రమాదాలకు ప్రధాన కారణాలన్నారు. రోడ్ సేఫ్టీ అనేది పోలీసులదే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.