02-11-2025 12:00:00 AM
ఐదుగురికి గాయాలు
మరిపెడన మండలం బురహాన్పురం శివారులో ఘటన
మరిపెడన, వవంబర్1(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం 365 జాతీయ రహదారిపై బొలెరో బోల్తా పడి ఒకరు మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం బురహాన్పురం గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఉప్పరగూడెం పరిధిలోని హము తండాకు చెం దిన ఇద్దరు వ్యక్తులు, మరిపెడ మండలం లచ్చతండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు సూర్యాపేట జిల్లా కేంద్రంలో క్యాటరింగ్ పని నిమిత్తం వెళ్తున్నారు.
ఈక్రమంలో మరిపెడ మండల బురహాన్ పురం గ్రామ శివారులో కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి వీరి వాహనం బోల్తా పడింది. దీంతో వారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికి త్స నిమిత్తం 108 లో మహబూబా ఏరియా ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ మండల గ్రామ శివారు తూక తండాకు చెం దిన మాలోతు గణేశ్ ఆలియాస్ పవన్ (20) మృతి చెందాడు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మరిపెడ ఎస్ఐ వీరభద్రరావు తెలిపారు.