17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బీసీ వర్గాల సాధికారతకు నూతన దిశ

01-11-2025 10:11 PM

ఎల్లారెడ్డిలో జక్కుల సంతోష్ బాధ్యతలు..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): బీసీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం కృషి చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో కొత్త ఊపిరి నింపే విధంగా ఇటీవల కీలక నియామకం జరిగింది. జిల్లా అధ్యక్షులు చింతల శంకర్ నేత చేతుల మీదుగా శనివారం ఎల్లారెడ్డి మండల ఇంచార్జిగా జక్కుల సంతోష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చింతల శంకర్ నేత మాట్లాడుతూ బీసీ వర్గాల అభివృద్ధి కోసం గ్రామ స్థాయి నుండి పోరాడే నాయకులు కావాలి. సంతోష్ లాంటి యువ నాయకులు సంఘాన్ని మరింత బలపరుస్తారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జక్కుల సంతోష్ కుమార్ (వెల్లుట్ల) మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజా సేవకు వేదికగా మార్చుకుంటాను. ఎల్లారెడ్డి మండలంలోని ప్రతి బీసీ కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ నియామకంతో ఎల్లారెడ్డి మండలంలో బీసీ సంక్షేమ కార్యక్రమాలకు కొత్త దిశ లభించనున్నదనే ఆశాభావం వ్యక్తమవుతోంది.