09-09-2025 11:57:23 PM
సదాశివనగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) సదశివనగర్ మండలంలోని కుప్రియల్ గ్రామ స్టేజి వద్ద 44 వ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని పద్మాజీవాడికి చెందిన మ్యాదరి బాలయ్య కామారెడ్డి నుండి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా వెనుక నుండి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బాలయ్య తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాగా వెనక ఉన్న వ్యక్తికి బలమైన గాయాలు ఐయ్యి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.