04-07-2025 01:28:55 AM
బెల్లంపల్లి అర్బన్, జూలై 3 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రమాదవశాత్తు ఇంటి పైనుంచి పడి మృతి చెందిన కందుకూరు తిరుపతి (47) కళ్ళను దానం చేసి ఆయన కుటుంబం ఆదర్శంగా నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీకీ చెందిన కందుకూరు తిరుపతి తన ఇంటి పైకప్పును సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇంటి పై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే కుటుంబ సభ్యులు వరంగల్ ల్లోనీ ఓ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ కందుకూరి తిరుపతి ఆసుపత్రిలోనే మృతి చెందాడు. కుటుంబ పెద్దదిక్కు మృతి చెంది శోకసముద్రంలో ఉన్న ఆ కుటుంబ సేవాభావాo స్ఫూర్తిగా నిలిచింది. కళ్ళు దానం చేసి మరొకరికి కంటిచూపు ప్రసాదించాలని ఉద్దేశంతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తిరుపతి కళ్ళను దానం చేశారు.