15-10-2025 08:42:59 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని గ్రౌండ్ బస్తికి చెందిన రత్నం రాజం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే బస్తీకి చెందిన భోగి మోహన్ కు చెక్ బౌన్స్ కేసులో ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు, రూ ఐదు లక్షల జరిమానా విధిస్తూ బెల్లంపల్లి సివిల్ జడ్జి జె.ముఖేష్ బుధవారం తీర్పునిచ్చినట్లు బెల్లంపల్లి వన్టౌన్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. రూ 3.5 లక్షల చెక్ బౌన్స్ అయినట్లు సిఐ తెలిపారు.