హెల్ప్డెస్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, జూలై 12 (విజయక్రాంతి): ఎన్యుమరేషన్ ఫారంలను నింపడంలో ఓటర్లకు సహకరించేందుకు ఉచిత హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. యూసుఫ్ గూడ డివిజనులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా పరిశీలన,ఎన్యుమరేషన్ ఫారంలను నింపడం,ఎస్ఐఆర్ కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి హెల్ప్ డెస్క్ లు ఉపయోగపడతాయన్నారు.
వాటిని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అర్హులైన ప్రతి ఒక్కరి పేరు 2026 ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా కాంగ్రెస్ పార్టీ తరపున కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.ఓటర్లకు ఇబ్బంది తలెత్తకుండా పార్టీ అనుంబంధంగా ఉన్న బీఎల్ఏలు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. సహాయక చర్యలను మరింత వేగవంతంగా చేయాలని పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






