31 March, 2026 | 2:41 AM

మాదకద్రవ్యాల జోలికి పోకూడదు

31-03-2026 12:31 AM

జడ్చర్ల, మార్చి 30: మాదక దవ్యాలకు జోలికి ఎట్టి పరిస్థితుల్లో పోకూడదని గ్రామ సర్పంచ్ గోదల సాయిరెడ్డి అన్నారు. సోమవారం మండలం కోడ్గల్ గ్రామంలో 99 రో జుల ప్రజా పాలనలో భాగంగా కోడ్గల్ గ్రా మంలోని గురుకుల పాఠశాలలో డ్రగ్స్ ని యంత్రణ మీద ఈగల్ టీం విద్యార్థులకి అ వగాహనా సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ ని ర్మూలించడానికి, వాటి వల్ల కలిగే నష్టాలు తెలుపుతూ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేపించారు.

ఈ కార్యక్రమంలో ఈగిల్ టీం బుచ్చ య్య, జడ్చర్ల ఎస్‌ఐ జయ ప్రసాద్, ఎక్సైజ్ ఎస్‌ఐ కార్తీక్ రెడ్డి,గురుకుల ప్రిన్సిపాల్ టి .అనిత, ఉపాధ్యాయ బృందం మరియు ఐ టీడీసీ బృందం,వార్డ్ సభ్యులు బాలరాజ్ గౌ డ్, మున్నూర్ నర్సిములు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.