27-01-2026 12:45:58 AM
వైఫల్యాల బాటలో ఓపెనర్
ఇలాగైతే చోటు గల్లంతే ?
కివీస్తో సిరీసే చివరి ఛాన్స్
దూసుకొస్తున్న ఇషాన్ కిషన్
భారత క్రికెట్ జట్టులో అవకాశాలు అందరికీ రావు.. అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి.. ఎందుకంటే టీమిండియాలో చోటు దక్కడం ఎంత కష్టమే దానిని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం.. స్పష్టంగా చెప్పాలంటే ఎప్పటికప్పుడు పెర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉండాలి. ఒకవేళ ఒకటిరెండు మ్యాచ్లలో ఫెయిలైతే మాత్రం తుది జట్టులో చోటు గల్లంతవుతుంది. నెలల తరబడి వైఫల్యాల బాట వీడకుంటే కెరీరే ప్రమాదంలో పడుతుంది. ప్రస్తుతం భారత యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ మొదటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. తుది జట్టులో తన ప్లేస్ ను తానే ప్రమాదంలో పడేసుకుంటున్నాడు.
గుహావటి, జనవరి 26 : టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగం గా సంజూ శాంసన్పై నమ్మకముంచిన గంభీర్ అతనికి అవకాశమిచ్చాడు. దీని కోసం పేలవ ఫామ్లో ఉన్న వన్డే కెప్టెన్ గిల్ను సైతం పక్కన పెట్టేశాడు. న్యూజిలాండ్తో సిరీస్ దుమ్మురేపుతాడనుకున్న సంజూ వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తున్నాడు. ఇప్పటి వ రకూ జరిగిన మూడు టీ ట్వంటీల్లోనూ విఫలమయ్యాడు. తొలి టీ ట్వంటీలో 10 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత రాయ్పూర్ టీ ట్వంటీలో 6 పరుగులకే ఔటయ్యాడు. ఈ రెండు సందర్భాల్లోనూ చెత్త షాట్లతోనే వికెట్ పారేసుకున్నాడని పలువురు అభిప్రాయపడ్డా రు. తాజాగా మూడో టీ ట్వంటీలో అసలు ఖాతానే తెరవలేదు. ఇ న్నింగ్స్ తొలి బంతికే డకౌటై నిరాశపరిచాడు.
దీంతో సంజూ శాంస న్పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో మద్ధతుగా నిలిచిన ఫ్యాన్సే ఇప్పుడు తిట్టిపోస్తున్నారు. ఇచ్చిన అవకాశాలను వరుసగా వృథా చేసుకుంటున్నాడంటూ ఫైర్ అవుతు న్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే కివీస్ తో జరిగిన మూడు టీ ట్వంటీలూ బ్యాటింగ్ పిచ్ లే. అటువంటి పిచ్ లపై అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ వంటి వాళ్లు చెలరేగిపోతుంటే ఎంతో టాలెంట్ ఉండి కూడా సంజూ ఇలా ఫెయి లవుతుండడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో చాలాసార్లు సంజూకు అన్యాయం జరు గుతోంది.. సెలక్టర్లు అతని కెరీర్ను నాశనం చేస్తున్నారం టూ వ్యాఖ్యానించిన అభిమానులు, మాజీలు ఇప్పుడు సంజూ వైఫల్యాల బాటను వీడకపోవడంపై షాక్కు గురవుతున్నారు. ఎందుకంటే ప్రపంచకప్కు ముం దు కివీస్తో సిరీసే చివరిది. మిగిలిన రెండు మ్యాచ్ లోనైనా రాణించకుంటే అసలు తుది జట్టులో చో టు గల్లంతయిపోతుంది.
మెగాటోర్నీలో టీమ్ కాం బినేషన్ విషయం లో రాజీ పడే పరిస్థితులు లేవని హెడ్కోచ్ గంభీర్ ఇప్పటికే చెప్పేశాడు. దీంతో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారిని నిరాశపరచకుండా ఎవరైతే ఫెయిలవుతున్నారో వారిని తప్పించేయడం ఖాయం. ప్రస్తుతం కివీస్పై సిరీస్ గెలుచుకోవడంతో మిగిలిన రెండు మ్యాచ్లలో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, రిజర్వ్ ప్లేయర్స్కు అవకాశాలు దక్కనున్నాయి. ఈ క్రమంలో సంజూ శాంసన్కు ఈ రెండు మ్యాచ్లే చివరి అవకాశాలుగా భావిస్తున్నారు. ఎం దుకంటే తిలక్ వర్మ కోలుకుంటున్నప్పటకీ కివీస్తో సిరీస్ నుంచి పూర్తిగా తప్పించారు. నేరుగా ప్రపంచకప్లో ఆడేందుకు తిలక్ ఫిట్నెస్పై ఫోకస్ పెట్టనున్నాడు.
ఈ నేపథ్యంలో తిలక్ జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్ ను తప్పించాల్సిందే. అయితే తిలక్ వర్మ స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్ లోకి వచ్చి న ఇషాన్ కిషన్ 8, 76, 28 పరుగులు సత్తా చాటా డు. ఈ ఇద్దరి ప్రదర్శనల్లో ఉన్న స్ప ష్టమైన తేడానే ఇప్పుడు సెలెక్షన్ చర్చల్లో ప్రధాన అం శంగా మారింది. మరి ఫా మ్లో ఉన్న ఇషాన్ ను తప్పించి ఓపెనర్గా సంజూను కొనసాగిస్తే విమర్శలు ఎదుర్కోక తప్పదు. ప్రస్తు త పరిస్థితుల్లో సంజూ శాంసన్ ప్లేస్కు ఇషాన్ కిషన్ ఎర్త్ పెట్టబోతున్నాడు. కాగా నిలకడ లేమి కారణంగానే సంజూ కెరీర్ త క్కువ మ్యాచ్ లకే పరిమితమయ్యేలా కనిపిస్తోందని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీ కాంత్ వ్యాఖ్యానించారు. గత ఏడాదిన్నర కాలంగా అతని ప్రదర్శన చాలా అస్తవ్యస్తంగా ఉందని గుర్తు చేశాడు.
ఇదిలా ఉంటే భారత ప్రపంచ కప్ జట్టులో చోటు గురించి సంజూ శాంసన్కు కోచ్, కెప్టెన్ భరోసా ఇవ్వాలని భారత టెస్ట్ జట్టు మాజీ కెప్టెన్ రహానే అభిప్రాయపడ్డాడు. సంజూ పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నాడు. సంజూ ఉత్తమ ప్రదర్శన కనబరచాలంటే కెప్టెన్, మేనేజ్మెంట్ పాత్ర ఎంతో ముఖ్యమన్నా డు. ప్రపంచకప్లోనూ ఓపెనర్గా కొనసాగాలంటే మాత్రం సంజూ న్యూజిలాండ్ పై చివరి రెండు టీ20 ల్లోనూ మెరుపు ఇన్నింగ్స్లు ఆడాల్సిందే. లేకుంటే తుది జట్టులో ప్లేస్ గల్లంతయినట్టేనని మాజీలు తేల్చేస్తున్నారు.