calender_icon.png 2 August, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరి సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్

02-08-2025 02:08:54 AM

  1. ఆపరేషన్ ముస్కాన్ లో 68 మంది బాలబాలికల గుర్తింపు
  2. 8 కేసులు నమోదు జిల్లా ఎస్పీ  యం రాజేష్ చంద్ర

కామారెడ్డి, ఆగస్టు 1 (విజయక్రాంతి), కామారెడ్డి జిల్లాలో అన్ని శాఖల అధికారుల సహకారంతో ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్ అయిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించ డానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్త్మ్రల్ ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలను  నిర్వహిస్తుందన్నారు.

జూలై 1 నుంచి 31 వరకు పోలీస్ శాఖ, చైల్ వెల్ఫేర్, కార్మిక శాఖ, విద్యాశాఖ, చైల్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, రెవిన్యూ, వైద్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక టీములుగా ఏర్పాటు చేసి ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 68 మంది బాలబాలికలను గుర్తించి సిడబ్ల్యూసి ముందు హాజరపరచగా వారి తల్లిదండ్రులకు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.

బాల కార్మికులు 30, బడికి వెళ్ళని పిల్లలు 38 మంది ఉన్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలలో పిల్లలను పనిలో పెట్టుకున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 68 మంది బాలబాలికల సంరక్షణ చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సహకరించడం ముస్కాన్ విజయవంతం చేసినందుకు ఎస్పీ రాజచంద్ర అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ..

.బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్త్మ్రల్, ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్  విజయవంతం కోసం

ఈసంవత్సరం జులై 1 నుండి 31 వరకు పోలీస్ శాఖ,చైల్ వెల్ఫేర్,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్,చైల్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్,రెవెన్యూ, హెల్త్ డిపార్ట్మెంట్ ,వివిధ శాఖల అధికారులతో జిల్లాలో టీమ్ లుగా ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 68 మంది బాలబాలికలను గుర్తించి CWC ముందు హాజరుపర్చగా వారి యొక్క తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి వారికి అప్పగించడం జరిగిందని, వీరిలో బాల కార్మికులు  30, బడికి వెళ్లని పిల్లలు  38 మంది ఉన్నారు.

18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై 08 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని,బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి  చేయాలని కోరారు.తరుచు బాలల చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.వీధి బాలలను చూసినప్పుడు స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని సూచించారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం చేయడానికి సహకరించిన అన్ని శాఖల అధికారులను,సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.