06-05-2025 12:00:00 AM
మోర్తాడ్, మే 5 : మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల లో చదువుతున్నటువంటి ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ గవర్నమెంట్ హైస్కూల్ నందు నిర్వహించబడుతుందని శ్రీ మోర్తాడ్ మండల విద్యాశాఖ అధికారిడి సమ్మిరెడ్డి గారు తెలియజేయడం జరిగినది.
ఇందులో మ్యూజిక్ డ్యాన్స్ డ్రాయింగ్ యోగా లేదా కరాటే నేర్పించడం జరుగుతుందని అలాగే ప్రతి ఈవెంట్ ఒక గంట సేపు ఉంటుందని ఇది ఈనెల 10వ తారీకు నుండి 24 తారీకు వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని తెలియజేశారు అలాగే విద్యార్థులకు స్నాక్స్ అందజేస్తారని తెలియజేశారు ఇట్టి అవకాశాన్ని మోర్తాడ్ మండలంలోని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఇట్టి సమ్మర్ క్యాంప్ లో పాల్గొనే విద్యార్థులు రేపటినుండి గవర్నమెంట్ హై స్కూల్ మోర్తాడ్ లో తమ వివరాలను ఉదయం 8 గంటల నుండి నమోదు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి తెలియజేశారు.