16-02-2026 01:44:53 PM
మేయర్గా మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పాలమూరు కార్పొరేషన్(Palamuru Corporation ) ఎన్నిక తీవ్ర ఉత్కంఠ మధ్యలో మేయర్ గా గుమ్మల్ మమత ఎన్నిక కాగా, డిప్యూటీ మేయర్ గా మారేపల్లి సురేందర్ రెడ్డి ను పాలకవర్గం కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నదమవుతుండ్రు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, తదితర ప్రముఖులు ఉన్నారు.