9 April, 2026 | 10:47 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కరపత్రాలు, పోస్టర్స్ ఆవిష్కరణ

03-01-2026 12:00 AM

కామారెడ్డి, జనవరి 2 (విజయక్రాంతి): రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్బముగా కరపత్రాలు, పోస్టర్స్ శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని సూచించారు. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో రవాణా శాఖ తరుపున పాఠశాల విద్యార్థులకు రహదారి నియమాలపై  విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమములో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  కే నరసింహ రెడ్డి, జిల్లా రవాణా అధికారి జే. శ్రీనివాస్ తో పాటు, సహాయక మోటార్ వాహన తనిఖీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, మరియు హోమ్ గారడ్స్ పాల్గొన్నారు.