13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

సబ్జెక్ట్ లేదు.. అంతా బూతు పురాణమే!

03-01-2026 12:00 AM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్

నూతన సంవత్సరం కాస్తా కాంగ్రెస్ పాలనలో బూతు సంవత్సరంలా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి వద్ద సబ్జెక్ట్ లేదని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకపోయినా బూతులు పుష్కలంగా ఉన్నాయి. ఒకపక్క కేసీఆర్‌ను ఉరితీయాలంటూనే, మరో పక్క ఆయనే సలహాలు ఇవ్వాలనడం సీఎం ద్వంద్వవైఖరికి నిదర్శనం. పక్క రాష్ట్రంతో జలవివాదాలున్నప్పు డు తెలంగాణపై అవగాహన ఉన్నవారు సలహాదారులుగా ఉండాలి. కానీ, ఇక్కడి ప్రాజెక్టు లపై కేసులేసిన ఆంధ్ర వ్యక్తి ఆదిత్యనాథ్‌ను పెట్టుకొని ఏపీకి నీళ్లు దోచిపెడుతున్నారు. 

ప్రశ్నలకు జవాబు లేకే మైకులు కట్  

బీఆర్‌ఎస్ విప్ కేపీ వివేకానంద

సీఎం సభ ప్రారంభానికి ముందే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ దగ్గరికి వెళ్లినట్లు వీడియోలు తీయించి, వాటిని రిలీజ్‌చేసి డ్రామా లు ఆడుతున్నారు. బయట ఇష్టానుసారం మాట్లాడుతూ లోపల మాత్రం నటిస్తున్నారన్నారు. ఇన్ని రోజులుగా ప్రతి పక్షం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదని, తా ము మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు అధి కార మదం నెత్తికెక్కిందని, గతంలో రేవంత్ అన్నట్లుగానే ఇప్పుడు బీహార్ వాళ్ల చేతిలో రాష్ట్రం ఉందా అని ప్రశ్నించారు.