15-06-2025 11:20:23 PM
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు..
శ్రీనుబాబుకు జై కొట్టిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు..
పెద్దపల్లి నుంచి మంథని వరకు... దారి పొడవున వెల్లువెత్తిన అభిమానాలు..
పెద్దపల్లి/మంథని (విజయక్రాంతి): మంథని నియోజకవర్గ ప్రజలను కనురెప్పల కాపాడుకుంటానని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(TPCC General Secretary Duddilla Srinu Babu) అన్నారు. టీపీసీసీగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా ఆదివారం పెద్దపల్లి జిల్లాకు వచ్చిన దుద్దిళ్ల శ్రీనుబాబుకు అడుగడుగునా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున నీరాజనాలు పలికారు. మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నుండి పెద్దపల్లి కమాన్ పూర్ సెంటినరీ కాలనీ, పన్నూరు, బేగంపేట్, లద్నాపూర్, రామయ్య పల్లి నుండి మంథని వరకు దారి పొడవునా అభిమానాలు వెలువెత్తాయి.
జిల్లాలోని ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు శ్రీను బాబును గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఆదివారం రాత్రి మంథనికి చేరుకున్నారు. అనంతరం ఇక్కడ జరిగిన అభినందన సభలో శ్రీనుబాబు మాట్లాడుతూ... ప్రజలు కార్యకర్తల అభిమానం చూసి ఒకసారి గా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ.. తన తండ్రి శ్రీపాదరావు ఆశయం మంథని నియోజకవర్గ ప్రజలను కనురెప్పల కాపాడుకోవడం ఒక్కటే అని తమకు చెప్పారే తప్ప.. పార్టీలో తమకు పదవులు ముఖ్యం కాదని.. ఎన్ని పదవులు వచ్చిన మంథని గడ్డను మాత్రం మరిచేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు.
నాతోపాటు ప్రతి ఒక్కరూ పార్టీ నిబంధనలకు కట్టుబడే పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడటం మనమంతా బాధ్యతగా తీసుకుందామన్నారు. ఎన్ని పదవులు వచ్చినా.. నేను మీలో ఒక సాధారణ కార్యకర్తనే అని అన్నారు. నియోజకవర్గంలో ఎప్పుడైనా ఎవరికైనా ఎలాంటి కష్టం వచ్చినా.. శ్రీపాద ట్రస్ట్ మాత్రం ముందుంటుందన్నారు. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ఇది ప్రజా పాలన ప్రభుత్వమని.. ప్రజలకు ఈ ప్రభుత్వంపై నమ్మకంతోనే మనకు ఓట్లు వేశారని... అలాంటి ప్రజలకు కార్యకర్తలు నాయకులు అందుబాటులో ఉండాలన్నారు.
వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు శశిభూషణ్ కాచే, కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షులు ముస్కల సురేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, మాజీ జెడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు వైనాల రాజు, రోడ్డ బాబు, దొడ్డ బాలాజీ, ఐలి ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ లు కొత్త శ్రీనివాస్, అల్లాడి యాదగిరిరావు, భాస్కరరావు, యూత్ మండల అధ్యక్షులు రెబల్ రాజ్ కుమార్, బక్కదట్ల వినీత్ యాదవ్, శ్రీకాంత్, నాయకులు కుడుదుల వెంకన్న, అజీమ్ ఖాన్, లింగయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.