23 March, 2026 | 3:08 PM

Breaking News

పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్   •   అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్   •   పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ   •   మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ   •   జగన్నాద్ పూర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు   •   మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సీఎం శుభవార్త   •   అణచివేత ధోరణి వీడి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి   •   ఓబీసీ చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే బాధ్యతలు.. పాల్గొన్న మంత్రి పొన్నం   •   పశ్చిమాసియాలో యుద్ధం.. లోక్‌సభలో మోదీ ఆందోళన   •   అసెంబ్లీ ముట్టడి అడ్డుకట్ట – బీజేపీ నాయకుల అరెస్టుపై ఆగ్రహం   •  

వరద బాధితులకు అండగా నిలవండి: జనసైనికులకు పవన్ పిలుపు

27-09-2025 11:11 AM

హైదరాబాద్: హైదరాబాద్‌ మూసీ వరదలపై(Musi floods) ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) స్పందించారు. హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవాలని అభిమానులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన(Janasena) తెలంగాణ నాయకులు, శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేశారు. వరద బాధితులకు ధైర్యం చెప్పి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, మూసీ వరదతో ఎంజీబీఎస్ తో పాటు పరిసరాలు నీటముగిగాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే సహాయచర్యలు చేపట్టింది. ప్రభుత్వం సూచనలు, వాతావరణ హెచ్చరికలను ప్రజలు అనుసరించాలని పవన్ కోరారు.