హమ్మయ్య.. మక్కల పైసలు పడ్డయ్!
ఒకేరోజు 20 కోట్లు చెల్లింపు
కేసముద్రం, మే 28 (విజయక్రాంతి): రెండు నెలల క్రితం మొక్కజొన్నలు మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా విక్రయించిన రైతులకు చెల్లింపులు ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం 25 కోట్ల రూ పాయల చెల్లింపులు జరగగా అందులో, 20 కోట్ల రూపాయలు ధనసరి సొసైటీ పరిధిలో మక్కలు విక్రయించిన రైతులకు చెల్లించడం విశేషంగా మారింది.
సొసైటీ పరిధిలో ఇప్పటివరకు 3,67,562 బస్తాల మక్కలను 3,887 మంది రైతుల వి క్రయించగా, క్వింటా లకు 2400 రూపా యల చొప్పున మార్క్ ఫెడ్ సంస్థ చెల్లింపులు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చే స్తున్నారు. గురువారం రైతుల సెల్ఫోన్లకు మొక్కజొన్నల విక్రయా లకి సంబంధించిన నగదు జమ చేసినట్లు మెసేజ్లు రావడం తో, వానాకాలం సాగు పెట్టుబడికి ఇబ్బంది తొలగిపోయిందని సంబరపడుతున్నారు.






