calender_icon.png 16 June, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెట్లను నరికితే పీడీ యాక్ట్ నమోదు

13-06-2025 02:01:38 AM

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మనోహరాబాద్(తూప్రాన్), జూన్ 12: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని మరింత విస్తరింప చేయాలని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మొక్కలు పెంచే కార్యక్రమాన్ని వనమహోత్సవ కార్యక్రమంగా అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం మనోహరబాద్ మండల పరిధిలోని ఐటీసీ పరిశ్రమలో 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, డీఎఫ్‌ఓ జోజితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనమహోత్సవంలో అన్ని రకాల శాఖల అధికారులు పారిశ్రామిక ప్రాంతాలు పాల్గొని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అడవులను కాపాడే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.జిల్లాలో 37 లక్షల మొ క్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అన్ని రకాల శాఖల అధికారులు పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమంలో భాగంగా కావాలని సూచించారు. చెట్లను నరికితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కటినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సదరు అధికారులు పట్టించుకోకపోతే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రకాష్ రావు, ఆర్డీఓ జయ చంద్రరెడ్డి, మనోహరాబాద్ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో మనోహరాబాద్, కృష్ణమూర్తి, ఎంపీడీవో తూప్రాన్ శేషాద్రి మనోహరాబాద్ ఎంపీవో శ్రీనివాసరెడ్డి, ఆదినారాయణ , ఐటీసీ పరిశ్రమ యజమానులు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.